5 - అథ శ్రీ రామావతారవర్ణనమ్.

అగ్ని పలికెను : దేనిని పఠించినచో భుక్తియు ము క్తియు లభించునో అట్టి రామాయణమును, నారదుడు వాల్మీకికి చెప్పిన విధమున చెప్పెదను.

విష్ణు పు సాభియందలి పద్మమునుండి బ్రహ్మ పుట్టెను. మరీచి బ్రహ్మ కుమారుడు. మరీచికి కశ్యపుడును, ఆతవికి సూర్యుడును, సూర్యునకు వై వస్వతమనువును ఆతనికి ఇక్ష్వాకువును పుట్టిరి. అతని వంశమునందు కకుళ్పుడు పుట్టెను. కకుళ్సునకు రఘువు, రఘువునకు ఆజుడు, ఆజునకు దశరథుడును పుట్టెను.

శ్రీమహావిష్ణువు రావణాదులను వధించుటకై తాను నాలుగు విధములుగా అయి దశరథమహారాజు వలన కౌసల్య యందు రాముడుగను, కె కేయియందు భరతుడుగను, సుమిత్రయందు లక్ష్మణశత్రుఘ్నులుగను జనించెను. ఋష్యశృంగుని సాహాయ్యము చే యజ్ఞమునందు లభించిన పాయసమును కౌసల్యాదుల కియగా, వారు దానిని భుజింపగా, తండ్రితో సమాను లైన రామాదులు జనించిరి. లైన రామాదులు జనించిరి.

విశ్వామిత్రుడు కోరగా దశరథుడు యజ్ఞవిన్న ములను తొలగించుటకై లక్ష్మణసమేతుడైన రాముని విశ్వా మిత్రునితో పంపెను.

తాటకను సంహరించిన రాముడు (విశ్వామిత్రునినుండి) అస్త్ర శస్త్రములను పొందెను. మానవాగ్రముచే మారీచుని మూర్ఛితుని చేసి దూరముగా పడవేసెను. బలవంతుడైన ఆ రాముడు యజ్ఞమును పాడుచేయుచున్న “సుదామని సేనా సహితముగా సంహరించేను.

సిద్ధాశ్రమమునందు నివసించినవాడై, విశ్వామిత్రాదులతో కలిసి, లక్ష్మణ సమేతుడై , జనకుని యజ్ఞమును, ధనస్సును చూచుటకై వెళ్ళెను.

శతానందుడు విశ్వామిత్రుని ప్రభావమును గూర్చి రామునకు చెప్పెను. ఆ యజ్ఞమునందు జనకుడు. ముని నమేతు డైన రాముని పూజించేను. డైన రాముని పూజించెను.

రాముడు ధనస్సును ఎక్కు పెట్టి దానిని అనాయానముగా విరచెను. జనకుడు వీర్యమే కులముగా కలదియు, అయోనిజయు ఆగు తన కన్య యైన సీతను రామున కిచ్చెను. తండ్రి మొదలైన వారు వచ్చిన పిమ్మట రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళను, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె లైన మాండవీ శ్రుతకీర్తులను భరత, శత్రఘ్నులును వివాహమాడిరి.

ఆ రాముడు జనకునిచే బాగుగా సత్కరింపబడినవాడై, వసిష్టాది సమేతుడై పరశురాముని జయించి ఆయోధ్యకు వెళ్ళెను. భరతుడు శత్రుఘ్న సమేతుడై యుధాజిత్తు నగరమునకు వెళ్ళెను.

అగ్ని మహాపురాణము నందు రామాయణ బాలకాండ వర్ణన మను పoచమాధ్యాయము సమాప్తము.